Pamula Pushpa Srivani: మూడురాజధానులే మా విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడు రాజధానులు అంశం కీలకంగా మారింది. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు, మంత్రులు మూడురాజధానుల కోసం ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. ఈమధ్యే విశాఖలో భారీ స్థాయిలో విశాఖ గర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి విజన్ తో కూడిన ఆలోచన అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
Read Also: WhatsApp: తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు.. ఊపిరిపీల్చుకున్న యూజర్లు..
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఉత్తరాంధ్ర ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజలకు మధ్య తగవులు పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అమరావతి అనేది కేవలం 29 గ్రామాలకు పరిమితమైనటువంటి ఒక రాజధాని, అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరం. రాష్ట్రంలో ఇంత సంక్షేమ అభివృద్ధి జరిపిస్తూ లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టే పరిస్థితిఉందా అని ప్రశ్నించారు పాముల పుష్పశ్రీవాణి. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాలనే ఉద్దేశంతో అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేయబోతున్నాం అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అయ్యుండి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం అమరావతి రాజధానికి మద్దతు పలకడం దారుణం అని మండిపడ్డారు. ఇప్పటికే కొంత అభివృద్ధి చెందిన విశాఖను కొంత మేర ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లయితే కొన్ని దశాబ్దాల్లో హైదరాబాద్ ను తలదన్నే రాజదాని అవుతుందన్నారు. మా పార్టీ విధానం , మా ప్రభుత్వ విధానం మూడు రాజదానులే అని ఆమె స్పష్టం చేశారు.
Read Also: Top Five Luxury Brands in the World: ప్రపంచంలోని టాప్ ఫైవ్ లగ్జరీ బ్రాండ్స్
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!