AP Power Cuts: విద్యుత్ కోతలకు కారణం అదే!
ఏపీలో కరెంటు కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే.సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయింది. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్,
ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కొత విధించాల్సి వచ్చింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read
- Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
https://ntvtelugu.com/former-minister-bandaru-satyanarayana-murthy-counter-to-vijayasai-reddy-comments/
లేక పోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పాం. ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి. వ్యవసాయ అవసరాల వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిశ్రమలకు యధావిధిగా సరఫరా జరుగుతుంది. బొగ్గు సరఫరా గురించి సీఎం, ఎంపీలు ప్రధానితో మాట్లాడితే ఎక్కువ సరఫరా మన రాష్ట్రానికి కూడా జరిగే అవకాశం ఉంటుంది.
మన పొరుగు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ ఇబ్బంది ఉంది. ఆస్పత్రులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు పరిమితంగా కోతలు విధించాల్సి రావచ్చన్నారు. నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు లోటు ఉందని, నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించాం అన్నారు శ్రీధర్.
తాజావార్తలు
-
Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
-
RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
-
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
-
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
-
US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!