Cancer: ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్..! వణికిపోతోన్న బలభద్రపురం
- ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్..
- తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఘటన..
- బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer: ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు జలభద్రపురాన్ని వణికిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు.. గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఇక, క్యాన్సర్ కేసులపై అప్రమత్తమైన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఇవాళ గ్రామంలో 31 బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వే, గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు..
Read Also: Delimitation: తొలి ‘‘డీలిమిటేషన్’’ సమావేశంలో 7-పాయింట్ల తీర్మానం.. అవి ఏంటంటే..
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
బలభద్రపురం గ్రామంలో సుమారు పదివేల వరకు జనాభా నివాసం ఉంటున్నారు.. ఇప్పటికే 23 మంది క్యాన్సర్ చికిత్స తీసుకున్నట్లుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు.. అయితే, స్థానికంగా వాతావరణం కాలుష్యం కావడం.. నీరు, గాలి.. ఇలా అన్నీ కలుషితం కావడంతో.. గ్రామస్తులకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.. బలభద్రపురం సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల మూలంగా.. గాలి, నీరు కాలుష్యం అవుతున్నాయని.. దాని కారణంగా వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.. ఇప్పటికే వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారు.. మరికొంత మందికి దాని బారిన పడకుండా.. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు.. అయితే, బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. మృతులపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్న లెక్కలు సరికాదన్నారు.. పీహెచ్సీలకు వచ్చిన కేసుల ఆధారంగా అధికారులు లెక్కలు చెబుతున్నారు.. అసలు క్యాన్సర్ రోగులు పీహెచ్సీలకు ఎందుకొస్తారు? అని ప్రశ్నించారు.. అయితే, ఏడాది కాలంలో ఆ ఊరిలో క్యాన్సర్తో చనిపోయిన వారి దాదాపు 15 మంది కుటుంబాల్ని తానే పరామర్శించేందుకు వెళ్లానని ఎమ్మెల్యే చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
-
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!