Driver Subrahmanyam Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా కోర్టులో ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Subrahmanyam Case: రాజమండ్రి జిల్లా న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా సెషన్స్ కోర్టు ఊరట ఇచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ను రద్దు చేశారు. లక్ష్మీ దుర్గకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2 నిందితురాలిగా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. రూ.50,000 చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని.. పాస్పోర్ట్ కోర్టుకు అప్పగించాలని.. దేశం విడిచి వెళ్లకూడదని.. కాకినాడలోనే నివసించాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల రక్షణపై కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది కోర్టు..
Read Also: C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ఇక, లక్ష్మీ దుర్గకు విచారణకు సహకరించమని సూచించింది కోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును వేగంగా విచారించడం కోర్టు లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో లక్ష్మీ దుర్గను రెండో నిందితురాలిగా చేర్చారు. నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు అయినప్పటికీ, కేసు బలహీనపడినట్లు కాదు. బాధితుల తరఫున ముప్పాళ్ళ సుబ్బారావు వ్యాఖ్యానించారు: “నిందితులు తప్పించుకోలేరు, శిక్ష తప్పదు. నవంబర్ 30 వరకు కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడుతుంది.”
అయితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, నూకా రత్నం మరియు సత్యనారాయణ, తమ ఇంటి వద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల ఒక కారు ఢీకొన్న ఘటనలో గాయాలయినట్లు చెప్పారు. మరోవైపు.. పిట్టా వరప్రసాద్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, కోర్టు తీర్పు సామాజికంగా తప్పుడు సంకేతాలు ఇస్తుందని విమర్శించారు. “చెక్ బౌన్స్ కేసులోనూ, ఇలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు సమాజానికి దారుణ సంకేతాలను ఇస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత కేసు విచారణ వేగంగా సాగనుంది, బాధితుల రక్షణ మరియు న్యాయనిర్వహణ పై ముఖ్యమైన దృష్టి పెట్టబడింది.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!