Driver Subrahmanyam Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా కోర్టులో ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Subrahmanyam Case: రాజమండ్రి జిల్లా న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గకు జిల్లా సెషన్స్ కోర్టు ఊరట ఇచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ను రద్దు చేశారు. లక్ష్మీ దుర్గకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2 నిందితురాలిగా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. రూ.50,000 చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని.. పాస్పోర్ట్ కోర్టుకు అప్పగించాలని.. దేశం విడిచి వెళ్లకూడదని.. కాకినాడలోనే నివసించాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల రక్షణపై కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది కోర్టు..
Read Also: C. R. Patil : కాళేశ్వరంపై రాజ్యసభలో రచ్చ.. కేంద్ర జల శక్తి మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
ఇక, లక్ష్మీ దుర్గకు విచారణకు సహకరించమని సూచించింది కోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును వేగంగా విచారించడం కోర్టు లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో లక్ష్మీ దుర్గను రెండో నిందితురాలిగా చేర్చారు. నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు అయినప్పటికీ, కేసు బలహీనపడినట్లు కాదు. బాధితుల తరఫున ముప్పాళ్ళ సుబ్బారావు వ్యాఖ్యానించారు: “నిందితులు తప్పించుకోలేరు, శిక్ష తప్పదు. నవంబర్ 30 వరకు కేసు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడుతుంది.”
అయితే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, నూకా రత్నం మరియు సత్యనారాయణ, తమ ఇంటి వద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల ఒక కారు ఢీకొన్న ఘటనలో గాయాలయినట్లు చెప్పారు. మరోవైపు.. పిట్టా వరప్రసాద్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, కోర్టు తీర్పు సామాజికంగా తప్పుడు సంకేతాలు ఇస్తుందని విమర్శించారు. “చెక్ బౌన్స్ కేసులోనూ, ఇలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు సమాజానికి దారుణ సంకేతాలను ఇస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు తర్వాత కేసు విచారణ వేగంగా సాగనుంది, బాధితుల రక్షణ మరియు న్యాయనిర్వహణ పై ముఖ్యమైన దృష్టి పెట్టబడింది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!