తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయం వాలంటీర్లుకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్సూరెన్స్ చేయించారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతులు మీదుగా వాలంటీర్లుకు అందజేశారు. జిల్లాలో అభివృద్ధి పథంలో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను జిల్లా కలెక్టర్ హరికిరణ్ అభినందించారు.
అంతేకాకుండా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి అభివృద్ది కార్యక్రమాల్లో కలెక్టర్ హరికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో అత్యుత్తమ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.