Minister Nimmala: ఇద్దరి వ్యక్తిగత గొడవలతో ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం?
- నెల్లూరు జరిగిన ఘటనకు వైసీపీ కులం రంగు పులిమింది..
- ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలను ఆ రెండు కులలాలకు ఏమిటీ కారణం..
- రాష్ట్రంలో వదంతులు, విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు: మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. నిందితుడ్ని ప్రభుత్వం ఏమైనా వెనకేసుకొచ్చిందా? అరెస్టు చేయకుండా ఆపిందా? అని క్వశ్చన్ చేశారు. కోడి గుడ్డుకి.. బోడి గుండుకి ముడి పెట్టినట్టు వైసీపీ వికృత చేష్టలకు, దిగజారుడు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారు.. కాపులపై వైసీపీ ఒలకబోస్తున్న మొసలి కన్నీరు చూసి ఆ సామాజిక వర్గం నేతలే నివ్వెర పోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
Read Also: Historical Diwali Stories: దీపాలు లేని దీపావళి.. ఈ గ్రామాల్లో ఆసక్తికరమైన దీపావళి చరిత్ర ..
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఆక, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీ కాపులకు చేసిన మేలు, ఆ సామాజిక వర్గం నేతల గుండెల్లో ఉందని మంత్రి నిమ్మల అన్నారు. కాపులకు రాజకీయ అధికారంలో అత్యధిక భాగస్వామ్యం కల్పించిన పార్టీ తెలుగుదేశమేనన్న సంగతిని గణాంకాలు చూస్తే వాస్తవాలు వెల్లడవుతాయి అన్నారు. పేటీఎం బ్యాచులతో, పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ మీడియాతో కులాల మధ్య చిచ్చు పెట్టడం దేశద్రోహ కన్నా దారుణమని చెప్పుకొచ్చారు. విష ప్రచారాలు చేసే అసాంఘిక శక్తుల పైనా, వారిని వెనక ఉండి నడిపిస్తున్న వారి పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, రాజకీయ ముసుగులో నేరగాళ్లు సృష్టించే వదంతులు, చేసే విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!