Historical Diwali Stories: దీపాలు లేని దీపావళి.. ఈ గ్రామాల్లో ఆసక్తికరమైన దీపావళి చరిత్ర ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Diwali Stories: దేశవ్యాప్తంగా దీపావళి వెలుగులు వ్యాపిస్తున్న సమయంలో.. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. వాస్తవానికి అసలు ఈ గ్రామాల్లో దీపాల పండుగను జరుపుకోరు. ఇంతకు దేశవ్యాప్తంగా పండుగ వెలుగులు విరజిమ్ముతున్న వేళ ఎందుకని ఈ గ్రామాల్లో మాత్రం చీకట్లు చుట్టుముట్టాయి. అసలు ఏంటి ఈ గ్రామాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన, ఆసక్తికరమైన చరిత్ర.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Maoist Party Central Committee: లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన!
Also Read
- Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
- Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
- New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దీపావళి పండుగ వెలుగులు లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో పండుగ సందర్భంగా ఎలాంటి రంగోలి వేయరు, దీపాలు వెలిగించరు, వేడుకలు జరుపుకోరు. వాస్తవానికి ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకోరు, కానీ ఈ పండుగ సందర్భంగా ఇక్కడి ప్రజలు దుఃఖిస్తారు. నిజానికి రాజ్గఢ్ ప్రాంతంలోని భావ, అటారి, చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలలో నివసిస్తున్న చౌహాన్ క్షత్రియ కుటుంబాలు ఈ దీపావళిని జరుపుకోరు.
పండుగ రోజున పృథ్వీరాజ్ చౌహాన్ను ముహమ్మద్ ఘోరి హత్య చేశాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. వారు పృథ్వీరాజ్ చౌహాన్ను తమ పూర్వీకుడిగా, గొప్ప యోధుడిగా భావిస్తారు. అందుకని ఇక్కడి ప్రజలు పండుగ రోజును ఆనందం కంటే ఎక్కువగా లోతైన దుఃఖం, గౌరవంతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పృథ్వీరాజ్ చౌహాన్ జ్ఞాపకార్థం దుఃఖిస్తారు, అందుకే దీపావళి పండుగను జరుపుకోరు. ఈ గ్రామాలలో దీపావళి రాత్రి ఇళ్ళు చీకటిలో ఉంటాయి. కనీసం ఎవరూ కూడా విద్యుత్ దీపాలు లేదా నూనె దీపాలను కూడా వెలిగించరు. కానీ పూజ (ఆరాధన) మాత్రం కచ్చితంగా చేస్తారు. లక్ష్మిదేవి, గణేశుడిని పూజించడానికి ఒక దీపం వెలిగిస్తారు. అయితే ఈ దీపం కూడా తర్వాత ఆరిపోతుంది. అలాగే పండుగ రోజున ప్రతి కుటుంబంలోని సభ్యులు రోజంతా నిశ్శబ్దంగా గడుపుతారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం..
ఈ గ్రామాల్లో ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇక్కడి ప్రజలు రాజు బలిదానాన్ని జరుపుకోరు. అయితే పండుగ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి రోజున వారు దీపావళిని పూర్తి స్థాయిలో జరుపుకుంటారు. ఆ రోజు వారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు, స్వీట్లు తయారు చేస్తారు, అందరూ కలిసి ఆనందంగా పండుగను నిర్వహించుకుంటారు. ఇక్కడి ప్రజలు దీనినే వారి దీపావళి పండుగా చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం.. వీళ్లను ఇతరుల నుంచి వేరు చేసింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలు దీపావళి రోజున దీపాలతో సంబరాలు చేసుకుంటుంటే.. ఇక్కడి ప్రజలు ధైర్యం, త్యాగం చరిత్రను గుర్తు చేసుకుంటారు. ఈ ఆచారం ఒక నివాళి మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను వారి చరిత్రతో అనుసంధానించడానికి శక్తివంతమైన సాధనంగా వాళ్లు పేర్కొన్నారు.
READ ALSO: Yama Deepam 2025: రేపు యమ దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది?
తాజావార్తలు
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!