Kethireddy Venkatarami Reddy: చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో మీకే ఇబ్బంది..! కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు బానే ఉంటారు..
- భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారు..
- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Venkatarami Reddy: సీఎం చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేసినా మిథున్ రెడ్డి జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారనీ, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు.. మరోవైపు, రాజధాని అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని.. మరో రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు కూడా లభిస్తాయనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana Weather Alert: రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు, మాజీ సీఎం జగన్ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై కేతిరెడ్డి స్పందిస్తూ…. జాతీయ జెండా ఎగరవేస్తేనో, చాక్లెట్లు పంచితేనో దేశభక్తి ఉన్నట్లు కాదనీ, దేశం యొక్క సమగ్రతకు, ఐక్యతకు పోరాడితే దేశభక్తి అవుతుందని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పోలీసులు పావులు అవుతున్నారు.. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు అవుతుందో స్పష్టం కావడం లేదన్నారు.. ఇవాళ ఏ విత్తనమేస్తే రేపు వాటి రుచి మీరు కూడా చూడాల్సి ఉంటుందన్నారు.. ప్రజాస్వామ్యాన్ని కోర్టులను గౌరవించాలని సూచించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఇక, అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు కట్టు కథ అని కొట్టిపారేశారు.. వైసీపీ నేతలను మానసికంగా వేధించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. పార్టీని బలహీనపరచడానికి అక్రమ అరెస్టులు జరుపుతున్నారు.. నియోజకవర్గంలో బలమైన వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. జైల్లో మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదు.. కోర్టు ఉత్తర్వులున్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా నిలుపు చేస్తున్నారు.. చట్టం పట్ల లోకేష్ కు ఎటువంటి ఆలోచన ఉందో దీనిని బట్టి అర్ధం అవుతుందన్నారు.. కడిగిన ముత్యం మాదిరిగా వైసీపీ నేతలంతా బయటకు వస్తారని పేర్కొన్నారు అనంత వెంకటరామిరెడ్డి .
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!