Kethireddy Venkatarami Reddy: చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో మీకే ఇబ్బంది..! కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు బానే ఉంటారు..
- భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారు..
- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Kethireddy Venkatarami Reddy: సీఎం చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేసినా మిథున్ రెడ్డి జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారనీ, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు.. మరోవైపు, రాజధాని అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని.. మరో రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు కూడా లభిస్తాయనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana Weather Alert: రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
మరోవైపు, మాజీ సీఎం జగన్ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై కేతిరెడ్డి స్పందిస్తూ…. జాతీయ జెండా ఎగరవేస్తేనో, చాక్లెట్లు పంచితేనో దేశభక్తి ఉన్నట్లు కాదనీ, దేశం యొక్క సమగ్రతకు, ఐక్యతకు పోరాడితే దేశభక్తి అవుతుందని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పోలీసులు పావులు అవుతున్నారు.. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు అవుతుందో స్పష్టం కావడం లేదన్నారు.. ఇవాళ ఏ విత్తనమేస్తే రేపు వాటి రుచి మీరు కూడా చూడాల్సి ఉంటుందన్నారు.. ప్రజాస్వామ్యాన్ని కోర్టులను గౌరవించాలని సూచించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఇక, అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు కట్టు కథ అని కొట్టిపారేశారు.. వైసీపీ నేతలను మానసికంగా వేధించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. పార్టీని బలహీనపరచడానికి అక్రమ అరెస్టులు జరుపుతున్నారు.. నియోజకవర్గంలో బలమైన వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. జైల్లో మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదు.. కోర్టు ఉత్తర్వులున్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా నిలుపు చేస్తున్నారు.. చట్టం పట్ల లోకేష్ కు ఎటువంటి ఆలోచన ఉందో దీనిని బట్టి అర్ధం అవుతుందన్నారు.. కడిగిన ముత్యం మాదిరిగా వైసీపీ నేతలంతా బయటకు వస్తారని పేర్కొన్నారు అనంత వెంకటరామిరెడ్డి .
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?