AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..
- స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు..
- స్నేహితుడి భార్యతో రాఖీ కట్టుకోవడానికి నిరాకరణ..
- స్నేహితుడి భార్యపై అసభ్యవ్యాఖ్యలు చేసిన యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ కు చెందిన భాగ్ రాధాకాంత్. రాఖీ పండుగ రోజున తన భార్యతో రాఖీలు కట్టించడానికి స్నేహితులను ఇంటికి పిలిచాడు. అందరూ రాఖీలు కట్టించుకున్నారు. కానీ, ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు. పైగా రాధాకాంత్ భార్యా శీలాన్ని దూషించాడు. దీనితో సతీష్ కుమార్ పై కక్ష పెంచుకున్నాడు రాధాకాంత్ . పథకం ప్రకారం మద్యం మత్తులో ఉండగా తన తోటి స్నేహితులతో కలిసి సతీష్ కుమార్ ను హత్య చేశాడు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను టూ టౌన్ సీఐ పి. శివగణేష్ అరెస్టు చేశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన ఆల్కట్ గార్డెన్స్ చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజ అతనిని హత్య చేసినట్లు తేల్చారు. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. ధవళేశ్వరం ఐవోసీఎల్ ప్రాంతానికి చెందిన వేపాడి సతీష్ కుమార్(22) రాజమండ్రి రైల్వేస్టేషన్లో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ధవళేశ్వరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడప్పుడూ కైలాసభూమి వెనుక ప్రాంతంలో మద్యం తాగుతుండేవాడని సతీష్ కుమార్ తో పనిచేసేవారు చెప్పడంతో ఈ నెల 15న ఆయన సోదరుడు అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇక, రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ పి. శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 9న తెల్లవారుజామున సతీష్ కుమార్ స్నేహితులైన భాగ్ రాధాకాంత్, బాగ్ గౌతం, దొంగ సౌదిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజతో కలిసి గోదావరి గట్టు దిగువన కైలాసభూమి శ్మశానంలోకి వెళ్లినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఘటనకు ముందురోజు రాత్రి భాగ్ రాధాకాంత్ భార్య గురించి చెప్పమంటే నిరాకరించడంతోపాటు మళ్లీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.. దీంతో, వాగ్వాదం జరిగి అతన్ని కాళ్లు, చేతులతో తన్ని కర్రతో కొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ కుమార్ పీకపై భాగ్ రాధాకాంత్ కాలువేసి ప్రాణం పోయేవరకు తొక్కేసి, మృతదేహాన్ని కైలాసభూమి వెనక గోడ అవతల విసిరి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తేలింది. తమ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఆల్కట్ గార్డెన్స్ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!