Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News A Young Man Refused To Tie Rakhi With His Friends Wife Was Murdered By His Friends

AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..

Published Date :August 23, 2025 , 3:38 pm
By Sudhakar Ravula
  • స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు..
  • స్నేహితుడి భార్యతో రాఖీ కట్టుకోవడానికి నిరాకరణ..
  • స్నేహితుడి భార్యపై అసభ్యవ్యాఖ్యలు చేసిన యువకుడు..
AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Crime: స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ కు చెందిన భాగ్ రాధాకాంత్. రాఖీ పండుగ రోజున తన భార్యతో రాఖీలు కట్టించడానికి స్నేహితులను ఇంటికి పిలిచాడు. అందరూ రాఖీలు కట్టించుకున్నారు. కానీ, ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు. పైగా రాధాకాంత్ భార్యా శీలాన్ని దూషించాడు. దీనితో సతీష్ కుమార్ పై కక్ష పెంచుకున్నాడు రాధాకాంత్ . పథకం ప్రకారం మద్యం మత్తులో ఉండగా తన తోటి స్నేహితులతో కలిసి సతీష్ కుమార్ ను హత్య చేశాడు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను టూ టౌన్ సీఐ పి. శివగణేష్ అరెస్టు చేశారు.

Read Also: Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన ఆల్కట్ గార్డెన్స్ చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజ అతనిని హత్య చేసినట్లు తేల్చారు. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. ధవళేశ్వరం ఐవోసీఎల్ ప్రాంతానికి చెందిన వేపాడి సతీష్ కుమార్(22) రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడప్పుడూ కైలాసభూమి వెనుక ప్రాంతంలో మద్యం తాగుతుండేవాడని సతీష్ కుమార్ తో పనిచేసేవారు చెప్పడంతో ఈ నెల 15న ఆయన సోదరుడు అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

Read Also: Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..

ఇక, రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ పి. శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 9న తెల్లవారుజామున సతీష్ కుమార్ స్నేహితులైన భాగ్ రాధాకాంత్, బాగ్ గౌతం, దొంగ సౌదిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజతో కలిసి గోదావరి గట్టు దిగువన కైలాసభూమి శ్మశానంలోకి వెళ్లినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఘటనకు ముందురోజు రాత్రి భాగ్ రాధాకాంత్ భార్య గురించి చెప్పమంటే నిరాకరించడంతోపాటు మళ్లీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.. దీంతో, వాగ్వాదం జరిగి అతన్ని కాళ్లు, చేతులతో తన్ని కర్రతో కొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ కుమార్ పీకపై భాగ్ రాధాకాంత్ కాలువేసి ప్రాణం పోయేవరకు తొక్కేసి, మృతదేహాన్ని కైలాసభూమి వెనక గోడ అవతల విసిరి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తేలింది. తమ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఆల్కట్ గార్డెన్స్ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ కు తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap crime
  • friend
  • Friend Wife
  • friends

తాజావార్తలు

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions