AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..
- స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు..
- స్నేహితుడి భార్యతో రాఖీ కట్టుకోవడానికి నిరాకరణ..
- స్నేహితుడి భార్యపై అసభ్యవ్యాఖ్యలు చేసిన యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ కు చెందిన భాగ్ రాధాకాంత్. రాఖీ పండుగ రోజున తన భార్యతో రాఖీలు కట్టించడానికి స్నేహితులను ఇంటికి పిలిచాడు. అందరూ రాఖీలు కట్టించుకున్నారు. కానీ, ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు. పైగా రాధాకాంత్ భార్యా శీలాన్ని దూషించాడు. దీనితో సతీష్ కుమార్ పై కక్ష పెంచుకున్నాడు రాధాకాంత్ . పథకం ప్రకారం మద్యం మత్తులో ఉండగా తన తోటి స్నేహితులతో కలిసి సతీష్ కుమార్ ను హత్య చేశాడు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను టూ టౌన్ సీఐ పి. శివగణేష్ అరెస్టు చేశారు.
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన ఆల్కట్ గార్డెన్స్ చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజ అతనిని హత్య చేసినట్లు తేల్చారు. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. ధవళేశ్వరం ఐవోసీఎల్ ప్రాంతానికి చెందిన వేపాడి సతీష్ కుమార్(22) రాజమండ్రి రైల్వేస్టేషన్లో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ధవళేశ్వరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడప్పుడూ కైలాసభూమి వెనుక ప్రాంతంలో మద్యం తాగుతుండేవాడని సతీష్ కుమార్ తో పనిచేసేవారు చెప్పడంతో ఈ నెల 15న ఆయన సోదరుడు అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇక, రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ పి. శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 9న తెల్లవారుజామున సతీష్ కుమార్ స్నేహితులైన భాగ్ రాధాకాంత్, బాగ్ గౌతం, దొంగ సౌదిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజతో కలిసి గోదావరి గట్టు దిగువన కైలాసభూమి శ్మశానంలోకి వెళ్లినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఘటనకు ముందురోజు రాత్రి భాగ్ రాధాకాంత్ భార్య గురించి చెప్పమంటే నిరాకరించడంతోపాటు మళ్లీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.. దీంతో, వాగ్వాదం జరిగి అతన్ని కాళ్లు, చేతులతో తన్ని కర్రతో కొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ కుమార్ పీకపై భాగ్ రాధాకాంత్ కాలువేసి ప్రాణం పోయేవరకు తొక్కేసి, మృతదేహాన్ని కైలాసభూమి వెనక గోడ అవతల విసిరి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తేలింది. తమ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఆల్కట్ గార్డెన్స్ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!