Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. రఘువీరారెడ్డి భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత ఊరికి కొంతైనా మేలు చేయాలని చెబుతుంటారు.. దేశానికి రాజైనా అమ్మకు కొడుకే.. కన్నతల్లిని, సొంత ఊరిని మరవకూడదు అని చెబుతుంటారు.. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించి టాప్ గేర్ వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేయడమే కాదు.. తన సొంత ఊరి ప్రజల అభినందనలు అందుకుంటున్నాడు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం.. తాజాగా ఆ గ్రామంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. భారీ విరాళాన్ని అందించారు.
Read Also: Independence Day Politics :: ఎగిరే జెండా సాక్షిగా విమర్శలు-ప్రతివిమర్శలు..
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
అయితే, నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.. ఆ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 50 లక్షల విరాళాన్ని ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రఘువీరారెడ్డి… నీలకంఠాపురం గ్రామస్తులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్శమంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న ఆయన.. ప్రశాంత్ నీల్.. తన తండ్రి సుభాష్ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విరాళాన్ని అందించారని తెలిపారు.. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే అంటే 1947 ఆగస్టు 15న.. తన సోదరుడు సుభాష్ రెడ్డి జన్మించారని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆయన కన్నుమూశారు.. తన తండ్రి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నీలకంఠాపురంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. ఆ గ్రామంలో రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్మించిన ఆలయాలను కూడా సందర్శించారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాగా, ఏపీ రెండుగా విడిపోయి.. నవ్యాంధ్రలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన రఘువీరారెడ్డి.. ఆ తర్వాత సొంత ఊరికే పరిమితం అయ్యారు.. ఆలయాల నిర్మాణంపై దృష్టిపెట్టారు.. తన మనవరాలితో పొలాల్లో.. బావుల్లో సరదాగా గడుపుతూ.. ఎప్పటిప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022
నీలకంఠాపురం దేవస్థానములు సందర్శించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న ప్రముఖ దర్శకుడు రఘువీరారెడ్డి గారి అన్న కుమారుడు @prashanth_neel pic.twitter.com/uggpSGFe7j
— NKP Devasthanams (@nkpdevasthanam) August 15, 2022
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!