Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. రఘువీరారెడ్డి భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత ఊరికి కొంతైనా మేలు చేయాలని చెబుతుంటారు.. దేశానికి రాజైనా అమ్మకు కొడుకే.. కన్నతల్లిని, సొంత ఊరిని మరవకూడదు అని చెబుతుంటారు.. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించి టాప్ గేర్ వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేయడమే కాదు.. తన సొంత ఊరి ప్రజల అభినందనలు అందుకుంటున్నాడు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం.. తాజాగా ఆ గ్రామంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. భారీ విరాళాన్ని అందించారు.
Read Also: Independence Day Politics :: ఎగిరే జెండా సాక్షిగా విమర్శలు-ప్రతివిమర్శలు..
Also Read
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- OTR : బియ్యపు మధుసూదన్ రెడ్డిలో ఫైర్ ఆరిపోయిందా..?
అయితే, నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.. ఆ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 50 లక్షల విరాళాన్ని ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రఘువీరారెడ్డి… నీలకంఠాపురం గ్రామస్తులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్శమంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న ఆయన.. ప్రశాంత్ నీల్.. తన తండ్రి సుభాష్ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విరాళాన్ని అందించారని తెలిపారు.. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే అంటే 1947 ఆగస్టు 15న.. తన సోదరుడు సుభాష్ రెడ్డి జన్మించారని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆయన కన్నుమూశారు.. తన తండ్రి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నీలకంఠాపురంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. ఆ గ్రామంలో రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్మించిన ఆలయాలను కూడా సందర్శించారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాగా, ఏపీ రెండుగా విడిపోయి.. నవ్యాంధ్రలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన రఘువీరారెడ్డి.. ఆ తర్వాత సొంత ఊరికే పరిమితం అయ్యారు.. ఆలయాల నిర్మాణంపై దృష్టిపెట్టారు.. తన మనవరాలితో పొలాల్లో.. బావుల్లో సరదాగా గడుపుతూ.. ఎప్పటిప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022
నీలకంఠాపురం దేవస్థానములు సందర్శించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న ప్రముఖ దర్శకుడు రఘువీరారెడ్డి గారి అన్న కుమారుడు @prashanth_neel pic.twitter.com/uggpSGFe7j
— NKP Devasthanams (@nkpdevasthanam) August 15, 2022
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..