ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిలాఫలకంలో తమ నాయకుడి పేరు లేకపోవడంతో.. వైసీపీ వర్గాల మధ్య చిచ్చు రేగింది. పోలీసులు రంగంలోకి దిగేదాకా.. ఈ రగడ అదుపులోకి రాలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా గ్రామంలో స్కూల్ భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
అయితే.. ఆ శిలాఫలకంలో స్కూల్ భవనానికి స్థలం ఇచ్చిన దాత బిజ్జం రమణారెడ్డి పేరు లేకపోవడంతో, బిజ్జం అనుచరులు కోపాద్రిక్తులయ్యారు. దీంతో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలను చించేశారు. పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితుల్ని అదుపు చేసిన తర్వాత.. మంత్రి సురేష్ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసుల పహారా మధ్య ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.