Dharmana Prasad Rao: ఉత్తరాంధ్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి.. మా ఆవేదన గుర్తించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసమానత కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల వారివేనని వెల్లడించారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడంతో తమ ప్రాంతం బీదవారిగా మారిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఏపీలో ఒక్క విశాఖలో మాత్రమే ఉన్నాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయి.. దీని వల్ల అమరావతిలో సాధారణ కుటుంబం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదన్నారు. చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందక ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయని మంత్రి ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు అసమానతలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తమ గొంతు విని తమ ఆవేదనను గుర్తించాలని కోరారు.
Read Also: AP High Court: మేము కూడా ‘బిగ్బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
రాజధాని విషయంలో సెక్షన్ 6 ప్రకారం వేసిన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇచ్చిన నివేదికను మాజీ సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. కమిటీ నివేదిక వదిలేసి చంద్రబాబు సొంత పార్టీ నేతలతో కమిటీ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కమిటీ వేయవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సెంటర్లోనే రాజధాని ఉండాలని చెప్పడం కరెక్ట్ కాదని.. ఏ రాష్ట్ర రాజధాని సెంటర్లో ఉందో మేధావులు సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ లేదని చెబుతున్నారని.. మంగళగిరిలో లోకేష్ పోటీ చేసి ఓడిపోయారని.. సెంటిమెంట్ ఉందో లేదో ఆయనే చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో రెండేళ్లు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడ్డామని.. ఆదాయం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామని ధర్మాన చెప్పారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని.. జిల్లాల పునర్ విభజన చేస్తున్నామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ రోగులకు ఇన్నేళ్లలో ఏం చేశారని.. ఇప్పుడు తాము అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన 23 సంస్థలలో ఒక్క ప్రాజెక్ట్ కూడా శ్రీకాకుళం జిల్లాకు రాలేదని మంత్రి ధర్మాన విమర్శలు చేశారు. టీడీపీకి ఎల్లప్పుడూ పట్టం కట్టిన శ్రీకాకుళం జిల్లాకు ఆ పార్టీ ఏం చేసిందని నిలదీశారు. రెవెన్యూ మంత్రిగా విశాఖలో భూముల దోపిడీ జరగలేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతపు వ్యక్తులత చేతితో తమ కళ్లు పొడవాలని చూస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. తమ న్యాయమైన విశాఖ రాజధాని డిమాండ్కు వ్యతిరేకంగా ఎవరు మాటాడినా వ్యతిరేకిస్తామన్నారు.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!