MT Krishna Babu: 2047 వరకు సికిల్ సెల్ అనీమియా లేకుండా చేయాలన్నదే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MT Krishna Babu On Sickle Cell Anemia: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యప్రదేశ్లోని షాడోల్లో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ఈరోజు మొత్తం 7 కోట్ల మందికి సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏపీలోనూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో.. ఆరోగ్య కేంద్రాలలో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేపట్టనున్నారు. ఈ మిషన్ను లాంచ్ చేసిన అనంతరం.. మోడీ వర్చువల్గా ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని మంత్రి విడదల రజినీ వీక్షించారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజీ లెక్చర్ హాల్లో ఈ వర్చురల్ స్క్రీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి రజనితో పాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ కృష్ణబాబు, కమీషనర్ జే.నివాస్ సైతం ఈ వర్చువల్ మీట్ని వీక్షించారు.
AP JAC Amaravati: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ స్పషల్ ఛీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. సికిల్ సెల్ అనీమియాను 2047 నాటికి లేకుండా చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. ఈ సంవత్సరం 6.5 లక్షల మందికి సికిల్ సెల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు. మ్యాచ్ అవ్వని ట్రైడ్స్ ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటే.. వారి పిల్లలకు సికిల్ సెల్ అనీమియా వస్తుందని తెలియజేశారు. దీనికి ప్రతీ ఒక్కరికీ ఒక కార్డు ఇస్తామని పేర్కొన్నారు. పాడేరులో మొదటి ఫేజ్లో 40 సంవత్సరాల వయసులోపు వారికి టెస్టులు చేస్తామన్నారు. మొదటగా స్కూలు, కాలేజీలకు వెళ్ళే వారికి టెస్టులు చేస్తామని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లాగా సికిల్ సెల్ అనీమియా కార్డు ప్రధానం చేస్తామన్నారు. తర్వాత తరాల వారికి సికిల్ సెల్ అనీమియా రాకుండా చూడటమే తమ లక్ష్యమని ఆయన విశదీకరించారు.
Humanity: మానవత్వం చూపిన పోలీసులు.. చిన్నారిని లాలించిన మహిళ కానిస్టేబుల్..!
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!