Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Devotees Throng Temples On Maha Shivratri

Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Published Date :February 18, 2023 , 8:10 am
By NTV WebDesk
Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ గౌలిపురా మిత్రాక్లబ్‌లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. 25 నుంచి మార్చి 1 వరకు జ్యోతిర్లింగాలు దర్శనమివ్వనున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉచిత ధ్యాన శిబిరంతో పాటు ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు.

Also Read

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

Maha Shivam

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం, మేడ్చల్ జిల్లా కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కోటగూలు జిల్లా, రామప్పలోని కాళేశ్వర-ముక్తిశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌ లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.

వరంగల్ జిల్లా వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రుద్రాభిషేకంతో ప్రారంభమై ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేయిష్టంబాల ఆలయంతో పాటు ఖమ్మంజిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలం నాటి కూసుమంచి శివాలయం దక్షిణ భారతదేశంలోనే మూడవ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

నల్గొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలం వాడపల్లి శైవాయం, నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామంతో మారుమోగుతోంది. శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read also: Lord Shiva Sahasranama Stotram: శివరాత్రి పర్వదినాన ఈస్తోత్రాలు వింటే మృత్యుభయం తొలగిపోతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి పది గంటల సమయం పడుతుంది. సుమారు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 10.30 గంటలకు పాదాలంకరణ అనంతరం స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

హరహర శంభో మంత్రోచ్ఛారణలతో దక్షిణ కాశీ మారుమోగుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో స్నానాలు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా కమ్మసంద్రలోని శ్రీకోటి లింగేశ్వరాలయం ఆధ్యాత్మిక సౌందర్యంతో శోభిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. 108 అడుగుల మహా శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Maha Shivaratri

పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహా శివరాత్రి సందడి మొదలైంది. తిరునాళ్లకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో విద్యుత్ ప్రభాస్ కోటప్ప కొండకు బయలుదేరాడు. నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో హరహరో కోటయ్య, చేదుకో కోటయ్య అంటూ కొండపైకి విద్యుత్ దీపాలు వెలిశాయి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కొత్త రూట్లు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ, నరసరావుపేట నుంచి కొండ వెళ్లే ఆర్టీసీ బస్సులు పెట్లూరివారి పాలెం మీదుగా, కొండ నుంచి వినుకొండ వెళ్లే బస్సులు పమిడిమర్రు, జేఎన్‌టీయూ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పంచారామాలు శ్రీక్షీరరామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర జనార్థనస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. శివుడికి బిల్వార్చన పూజ, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలు, నీటి పందిళ్లు, ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.

శివరాత్రి సందర్భంగా పవిత్ర గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగింది. విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివభక్తులతో రాజమండ్రి రద్దీగా మారింది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గోదావరి జెట్టీలకు పోటెత్తడంతో రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, వీఐపీఘాట్, మార్కెండేయస్వామి రేవు, ఇసుక రేవులు భక్తులతో కిటకిటలాడాయి.

మరోవైపు కోటగుమ్మంలోని శివాలయంతోపాటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచరామక్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Maha Shivaratri 2023 Celebrations Live: మహా శివరాత్రి శుభవేళ ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • devotees
  • kotappa konda jathara
  • Lord Shiva
  • Maha Shivratri
  • shivratri

తాజావార్తలు

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

  • GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions