Deputy Cm Rajanna Dora: పవన్ రాజకీయాలు చంద్రబాబు కోసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేయడాన్ని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రుల పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిని.. కానీ పవన్ మీద ఉన్న అభిమానాన్ని ఈ ఘటనతో పోగొట్టుకున్నాడని అన్నారు రాజన్నదొర. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణ లో పెట్టుకోలేపోతున్నారని మండిపడ్డారు.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పవన్ కల్యాణ్ తన కోసం రాజకీయాలు చెయ్యడం లేదు చంద్రబాబు కోసమే చేస్తున్నాడని రాజన్నదొర విమర్శించారు. ఉత్తరాంధ్రలో రాజధానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రుల మీద రాళ్ళ దాడి హేయమైన చర్యగా భావిస్తున్నానని అన్నారు.పవన్ తన కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలి. ఇది ఇంతటి తో ముగిసిపోయేది కాదని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై చర్యలు ఉంటాయని.. శాంతిభద్రతలకు భంగం కలిగించినవారు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు డిప్యూటీ సీఎం రాజన్నదొర.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
విశాఖపట్నం పరిపాలన రాజధాని నిర్ణయానికి మద్దతుగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజా సంఘాల నాయుకులు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Read also: Deepika Padukone: ప్రపంచంలో టాప్-10 అందగత్తెల్లో దీపికా పదుకొనె
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!