Pawan Kalyan: ప్రభుత్వాలను నిందించడానికో.. రాజకీయ లబ్ది కోసమో ఈ దీక్ష చేపట్టడం లేదు..
- ప్రాయశ్చిత్త దీక్షను మొదలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన డిప్యూటీ సీఎం..
- 11 రోజుల పాటు కొనసాగనున్న ప్రాయశ్చిత్త దీక్ష: ఉప ముఖ్యమంత్రి పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం కావడంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేపట్టి దీక్షను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసమో నేను ఈ దీక్ష చేపట్టడం లేదన్నారు. స్వామి వారి పూజా విధానాలు మార్చేశారు.. శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు.. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. ఏ మతమైనా కావచ్చు ఏ ప్రార్థనా మందిరం కావచ్చు.. మనోభావాలు దెబ్బ తినకూడదు.. ప్రసాదాల్లో కల్తీ జరుగుతోంది.. నాణ్యత లేదని ముందు నుంచీ చెబుతున్నాం.. టీటీడీపై వైట్ పేపరు రావాలని కోరుకున్నాం.. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు.. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Kalindi Express: దారుణం.. మరోసారి రైలు ట్రాక్పై ఎల్పీజీ సిలిండర్..
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటోంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని.. ఆ రోజు రాజకీయం చేయలేదు..
దాడులు జరుగుతున్నప్పుడు చూస్తు కూర్చుకోడం కూడా తప్పే.. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు.. పగ ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు.. తప్పులు చేయడం అలవాటు అయింది.. దీనికి పుల్ స్టాప్ పెట్టాలి అన్నారు. వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఉన్న బోర్డు ఏం చేసింది..? అని ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేసిన వారిని వెనకేసుకురావద్దు.. చర్చి, మసీదులో జరిగితే ప్రపంచం అంతా గొడవ చేస్తారు.. హిందువులకు మనోభావాలు ఉండవా..?.. ఇదే ఇతర మతాలకు అన్వయిస్తారా..? అని చెప్పారు. సనాతన ధర్మం ఒకరు ప్రారంభించింది కాదు.. అన్ని విశ్వాసాలను దగ్గరకు తీసుకున్న నేల ఇది.. దోషులకు శిక్ష పడాలని పవన్ చెప్పారు.
Read Also: Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి.. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా..? హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశం కెబినెట్, అసెంబ్లీలో చర్చ జరిగాలి.. సీబీఐ విచారణకి ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలి.. ఆయన వెనుకే ప్రజలంతా ఉంటారు.. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలి అని ఆయన చెప్పుకొచ్చారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందు అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదు..? అన్నారు. టీటీడీ ఉద్యోగులు కామ్ గా ఉండి మహాపరాధం చేశారు.. అందుకే దీక్ష తీసుకున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!