Gas Cylinder: దారుణం.. మరోసారి రైలు ట్రాక్పై ఎల్పీజీ సిలిండర్..
- కాన్పూర్ దేహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్పై చిన్న గ్యాస్ సిలిండర్.
- కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్ను బోల్తా కొట్టడానికి కుట్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder on railway track: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో మరోసారి రైలు దుర్ఘటనకు కుట్ర పన్నిన ఘటన వెలుగు చూసింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్పై చిన్న గ్యాస్ సిలిండర్ కనుగొనబడింది. ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రైల్వే ట్రాక్పై ఎల్పీజీ సిలిండర్ను ఉంచారు. దీంతో పాటు రైల్వే లైన్ సమీపంలో పెట్రోల్, గన్ పౌడర్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్ రాజ్ డివిజన్ లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఎల్పిజి చిన్న సిలిండర్ కనుగొనబడింది. గూడ్స్ రైలు ఇక్కడి నుంచి వెళ్లబోతుండగా.. లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్ దొరికిన ప్రదేశం కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉంది. రైల్వే ట్రాక్పై 5 కిలోల కెపాసిటీ గల ఎల్పిజి ఖాళీ సిలిండర్ను ఉంచినట్లు గుర్తించామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో రైలు వేగం చాలా నెమ్మదిగా ఉందని తెలిపారు. సిలిండర్ను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి అధికారులకు సమాచారం అందించాడు. ఈ విషయమై ఆర్పీఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది. అంతేకాకుండా, స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. గత సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాన్పూర్ లో కాళింది ఎక్స్ప్రెస్ రైలును పేల్చివేసేందుకు పన్నినట్లు వెల్లడైంది. ప్రయాగ్రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్పై ఉంచిన ఎల్పీజీ గ్యాస్ నింపిన సిలిండర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత పెద్ద శబ్ధం కూడా వచ్చింది. అంతేకాదు ఘటనా స్థలంలో పెట్రోల్ నింపిన బాటిల్, గన్పౌడర్తో పాటు అగ్గిపుల్లలు కూడా లభ్యమయ్యాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో పాటు యూపీ ఏటీఎస్, పోలీసులు, జీఆర్పీ కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
ఈ ఘటన జరిగిన వెంటనే సెప్టెంబర్ 10న రాజస్థాన్ లోని అజ్మీర్లో గూడ్స్ రైలును బోల్తా కొట్టించే కుట్ర వెలుగులోకి వచ్చింది. అజ్మీర్ లోని సర్ధానాలో రైల్వే ట్రాక్పై సుమారు 70 కిలోల బరువున్న రెండు సిమెంటు బ్లాకులను ఉంచి గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ రైలు సిమెంట్ దిమ్మెలను పగులగొట్టి ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. దీనిపై పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..