Weather Update: అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాండూస్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం కలిగించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుఫాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. మాండోస్ తుపాను ప్రభావం తమిళనాడుతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కనిపించింది. భారీ వర్షాలు పడుతున్నాయి. పెనుగాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నష్టం అంచనాలు ఇంకా తయారుచేయాల్సి వుందని అధికారులు తెలిపారు.
33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1469 ఆహారపు ప్యాకెట్లు , 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
Read Also: Telangana Congress : పీసీసీ కమిటీ ప్రకటన..18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. పేర్లు ఇవే..!
మరోవైపు వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు తయారుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టాలపై సర్వే చేస్తాం అన్నారు. అధికారుల నివేదికల ఆధారంగా రైతులను ఆదుకుంటాం అని, నారుమళ్లు మునిగితే విత్తనాలను అందిస్తాం అని భరోసా ఇచ్చారు.చంద్రబాబు హయాంలో 16 వందల 23 మండలాలను కరువుగా ప్రకటించారు. గత మూడేళ్ళలో కరువు మండలాలు లేవు.రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చార. ఎంత చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్లయినా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. బంగారు రుణాలకూ వర్తింప చేస్తామన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.
Read Also: Vaishali Kidnap Case : హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు.. కొరికారు : వైశాలి
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!