KS Bharat: సీఎం జగన్తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricketer KS Bharat Met With CM YS Jagan In His Tadepalli Camp Office: గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో క్రికెటర్ కేఎస్ భరత్ (కోన శ్రీకర్ భరత్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రంలో క్రీడా సంబరాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ఏపీ ప్రభుత్వం.. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల సేవల్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు యువజన, క్రీడా శఖపై సమీక్ష సందర్భంగా.. క్రీడలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే క్యాంపు కార్యాలయానికి కేఎస్ భరత్ వచ్చాడు. ఈ సందర్భంగా.. అతడ్ని సీఎం జగన్ అభినందించారు. అటు.. టీం సభ్యుల ఆటోగ్రాఫ్తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి కేఎస్ భరత్ బహుకరించాడు.
Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
అనంతరం కేఎస్ భరత్ మాట్లాడుతూ.. ఇండియన్ క్రికెట్ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ కెప్టెన్గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందన్నాడు. ఈ విషయాలను తాను సీఎం జగన్తో పంచుకున్నానని, ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారని చెప్పాడు. తనకు మద్దతు కావాలని కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నాడు. దేశం గర్వపడేలా ఆంధ్ర రాష్ట్రం పేరు, ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం తనకు సూచించారని పేర్కొన్నాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని.. స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బాగుందని తెలిపాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రోత్సాహం అందిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. ఈ ప్రోత్సాహం వల్ల.. తనలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారన్నాడు. కాగా.. కొద్ది రోజుల కిందట సీఎం జగన్తో మరో క్రికెటర్ అంబటి రాయుడు కూడా సమావేశమైన సంగతి తెలిసిందే!
Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!