YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు.. వాస్తవాలు వెలికి తీసేందుకు ఒక్కరోజు చాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ, నాలుగేళ్లైనా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు తేల్చలేదని మండిపడ్డారు.. పులివెందులలో పిల్లల్ని అడిగినా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెబుతారని పేర్కొన్న ఆయన.. వివేకానంద రెడ్డి సామాన్యుడు కాదు… సీబీఐ ఎంత కాలం ఆయన హత్య కేసు దర్యాప్తు చేసింది..? ఆ హత్య కేసులో వాస్తవాలు బయటికి తీయడానికి ఒక్క రోజు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుంది.. ఇది సరైంది కాదని హితవుపలికారు రామకృష్ణ.. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు లేకుండా చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. వివేకానంద రెడ్డి కేసు తెలంగాణకి మార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.. సొంత బాబాయి కేసులో సరైన దర్యాప్తుకి సహకరించకుండా, న్యాయం జరగకుండా చేసినందుకు జగన్ సిగ్గు పడాలి అంటూ మండిపడ్డారు. మరోవైపు, పేద వర్గాలు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని.. టిడ్కో ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. మూడేళ్ల క్రితం టిడ్కో ఇళ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.. టిడ్కో ఇళ్లు చంద్రబాబు హయాంలో నిర్మించడం వలనే కక్ష పూరితంగా లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!