GSLV Mk3: జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి రెడీ అయ్యింది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది… ఈ అర్ధరాత్రి (శనివారం) 12.07 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ కొనసాగుతుండగా.. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత.. అంటే ఇవాళ అర్ధరాత్రి 12.07 గంటలకు (23.10.2022)న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ను ప్రయోగించనున్నారు.. ఇక, ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది రాకెట్.. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ అధీనంలోకి తీసుకోనున్నారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
ఎన్ఎస్ఐఎల్తో ఒప్పందం తర్వాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉందంటున్నారు.. 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది.. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారతదేశం నుండి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. మరోవైపు చంద్రయాన్ -3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్ లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?