Rajeev Gowda: మోడీ మాజీ కావడం తధ్యం..! కర్ణాటక నుంచి బీజేపీ ఓటమి షురూ అవుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajeev Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. మే 10న పోలింగ్ జరగనుండగా.. 13వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం అవుతుందంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. బీజేపీ ఓటమి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. 2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ విజయం ఖాయం.. మాజీ ప్రధానిగా మోడీ మారడం తధ్యం అని జోస్యం చెప్పారు.. అదాని ఆర్థిక అవతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకు నియమించడం లేదు..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం అవుతుందన్నారు.. దేశాన్ని బీజేపీ కార్పొరేట్లకు అమ్మాలని చూస్తోంది. ఆర్ధిక అవతవకలకు పాల్పడుతున్నారని ఆధారాలున్నా.. కేంద్ర ప్రభుత్వం తన తీరును సమర్థించుకుంది.. అదానీ, మోడీ మధ్య సంబంధాలు వాస్తవం అన్నారు.
Read Also: RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ప్రజలను దృష్టి మళ్లించడానికి అనవసర అంశాలను వివాదం చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు రాజీవ్ గౌడ.. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయన్న ఆయన.. దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారు. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదు..? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి కేంద్ర ప్రభుత్వం అవినీతికి అండగా ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఎలా ఆహ్వానిస్తారు..? అని ప్రశ్నించారు. అనుభవం, అర్హత లేని వారిని రక్షణ రంగంలోకి తీసుకు రావాలని చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆరోపించారు. గంగవరం, కృష్ణపట్నం, ముంబై పోర్టులను అదాని పరం చేసుకున్నారు. వాటిని తాకట్టు పెట్టి, లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
Read Also: Economic Crisis: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం…పిండి కోసం కొట్టుకున్న జనం!
ప్రధాని మోడీ ప్రజల కోసం కాకుండా పెట్టుబడి దారుల కోసం పని చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు రాజీవ్గౌడ.. ఈడీని ప్రయోగించి ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల కోసమే పెట్టినట్లుగా ఉందన్నారు. ప్రజల నుంచి పన్నుల రాబట్టడం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుందని మండిపడ్డ ఆయన.. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారు..? అని నిలదీశారు. అదానీ విషయంలో సెబీ ఇచ్చిన ఆధారాలు కూడా కేంద్రం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆయన.. దేశంలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయి కాబట్టే మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మోడీ మాయలు మాని.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలను మా పోరాటాలు ద్వారా ఎదుర్కొంటామని ప్రకటించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ..
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!