RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RUDA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్యూడీఏ) పరిధిలోకి మరో 65 గ్రామాలను తీసుకొచ్చింది.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని నాలుగు మండలాల పరిధిలో ఈ 65 గ్రామాలు ఉన్నాయి.. ఈ మేరకు విలీన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, కె.గన్నవరం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని 338 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. కొత్తగా విలీనమైన నాలుగు మండలాలతో 3142 చదరపు కిలోమీటర్లకు పెరిగిన రుడా పరిధి.. రామచంద్రాపురంలోని 20, కె.గన్నవరంలోని 24, రాయవరంలోని 7, కపిలేశ్వరపురంలోని 14 గ్రామాలను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా)లో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.
Read Also: Minister Indrakaran reddy: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
మొత్తంగా రాజమహేంద్రవరం నగరానికి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలను నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఇక, రాజమహేంద్రవరానికి ‘గ్రేటర్’ ట్యాగ్ విషయంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం వేమగిరి, కడియంలను ఆర్ఎంసీలో చేర్చవచ్చు అనే చర్చ సాగింది.. వాటితో పాటు సీతానగరం మండలంలోని బొబ్బిలంక, కాటవరం గ్రామాలు కూడా విలీనానికి సంబంధించిన పరిశీలించారు.. 21 గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసి)లో విలీనం చేయాలని గత ప్రభుత్వం డి-నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. విలీనమయ్యే గ్రామాలతో సహా ఆర్ఎంసి పరిధిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ను కూడా సిద్ధం చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు రూడా పరిధిలోకి ఏకంగా 65 గ్రామాలను తీసుకొచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
-
Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
-
P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..