RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RUDA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్యూడీఏ) పరిధిలోకి మరో 65 గ్రామాలను తీసుకొచ్చింది.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని నాలుగు మండలాల పరిధిలో ఈ 65 గ్రామాలు ఉన్నాయి.. ఈ మేరకు విలీన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, కె.గన్నవరం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని 338 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. కొత్తగా విలీనమైన నాలుగు మండలాలతో 3142 చదరపు కిలోమీటర్లకు పెరిగిన రుడా పరిధి.. రామచంద్రాపురంలోని 20, కె.గన్నవరంలోని 24, రాయవరంలోని 7, కపిలేశ్వరపురంలోని 14 గ్రామాలను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా)లో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ.
Read Also: Minister Indrakaran reddy: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
మొత్తంగా రాజమహేంద్రవరం నగరానికి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలను నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఇక, రాజమహేంద్రవరానికి ‘గ్రేటర్’ ట్యాగ్ విషయంలో మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదన ప్రకారం వేమగిరి, కడియంలను ఆర్ఎంసీలో చేర్చవచ్చు అనే చర్చ సాగింది.. వాటితో పాటు సీతానగరం మండలంలోని బొబ్బిలంక, కాటవరం గ్రామాలు కూడా విలీనానికి సంబంధించిన పరిశీలించారు.. 21 గ్రామ పంచాయతీలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసి)లో విలీనం చేయాలని గత ప్రభుత్వం డి-నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. విలీనమయ్యే గ్రామాలతో సహా ఆర్ఎంసి పరిధిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ను కూడా సిద్ధం చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు రూడా పరిధిలోకి ఏకంగా 65 గ్రామాలను తీసుకొచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!