పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు.
red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ఇక సీఎం జగన్ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.