ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని 60 వేల మంది టీచర్లకు కూడా ప్రభుత్వం ట్యాబ్లు అందిస్తోంది.
Read Also: Srinivas Goud: పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యం చేస్తే వదిలే ప్రసక్తే లేదు
ఇక, రేపటి నుంచి వారం రోజుల పాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అధికారులు.. ట్రయల్ మెథడ్లో నిడమానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేశారు.. ఆఫ్ లైన్ ఫార్మెట్లో ట్యాబ్లు అందిస్తారు.. బైజూస్ కంటెంట్ని అప్లోడ్ చేసిన ఆ ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు.. కోర్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాల వీడియోలు, ఎక్సర్సైజులు ఆ ట్యాబ్లలో పొందుపర్చనున్నారు. విద్యార్ధుల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ను ఈ ట్యాబ్లు పెంచుతాయని అంచనా వేస్తున్నారు.. అయితే, రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్.. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
బాపట్ల జిల్లా పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు… ఇక, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు బాపట్ల జిల్లా నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..