CM JAGAN: ఏపీలో ఇవాళ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్నారు సీఎం వైయస్ జగన్. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరుగుతోంది. ఏపీలో 176 మంది టీచర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది ప్రభుత్వం.
ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు.
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
Read Also: Jharkhand Crisis:జార్ఖండ్లో హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నేడే
ఇదిలా వుంటే ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవానికి దూరంగా ఉండాలని ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆయా సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అనేక శాంతియుత ఉద్యమాల ద్వారా సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేశామని, కానీ ఈ ప్రభుత్వం వైఖరి సమంజసంగా లేదన్నారు.. రాష్ట్రంలోని సీపీఎస్ ఉపాధ్యాయులు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని APCPSUS రాష్ట్ర అధ్యక్షుడు దాస్ తెలిపారు.
Read Also: Astrology: సెప్టెంబర్5, సోమవారం దినఫలాలు
తాజావార్తలు
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..