CM Jagan : పిల్లల భవిష్యత్ మార్చేది విద్యా దీవెన కార్యక్రమం
విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. గత నాలుగేళ్లలో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. స్కూళ్ల ను సమూలంగా మార్చివేశామని ఆయన తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన లో ఎలాంటి కత్తి రింపులు లేకుండా ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఒక్క మంచి పని అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Neeraj Chopra: మంచి మనసు చాటుకున్న నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ ఆటగాడిని పిలిచి మరీ..!
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ఒక్క హామీ అయినా నేరవెచ్చని వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. సొంత బలం… సొంత కొడుకు మీద నమ్మకం లేదు… దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకుంటాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వీరి మాటలు, భాష చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్న సీఎం జగన్.. రెచ్చగొట్టి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పుంగనూరు, అంగల్లు ఘటనలు చూసారని, కారులో తుపాకులు, బీరు బాటిళ్లతో వచ్చారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో 47 మంది పోలీసులు గాయపడ్డారని, ఒక పోలీస్ కన్ను కోల్పోయాడని, పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చేయాలని చూసారన్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళుతున్నాడు… తన హయాంలో దొంగ ఓట్లు నమోదు చేయించి, ఇప్పుడు మనపై ఫిర్యాదు చేయాలని చూస్తున్నాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఇదే బడ్జెట్తో చంద్రబాబు నాడు పాలించారు. మరి నాడు ఆయన ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేదు అని ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.
Also Read : Bomb Threat: కొచ్చి-బెంగళూర్ విమానానికి బాంబ్ బెదిరింపు..
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!