Chandrababu Serious: కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు..
  • మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..
  • మరోసారి ఆలస్యంగా రావొద్దని సూచించిన చంద్రబాబు..
Ap Cm

Ap Cm

Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ( డిసెంబర్ 11న) ఉదయం 10.30 గంటలకే మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది.. ఇకపై కేబినెట్ కు ఎవరైనా ముందుగానే రావాలి.. ఆలస్యంగా రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.

Read Also: AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. ఫైల్ క్లియరెన్స్లో జాప్యంపై సీఎం సీరియస్

×
×
Ad

ఇక, నిన్న (డిసెంబర్ 10న) నేను హెచ్ఓడీల సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను.. అక్కడ ఉన్న అందరికీ క్షమాపణలు కూడా చెప్పాను అని సీఎం చంద్రబాబు అన్నారు. నా తప్పును సరిదిద్దుకున్నాను.. మీరు కూడా ( ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఆనం రామనాయరణరెడ్డి, వాసంశెట్టి సుభాష్) సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.