AP Assembly: ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల
- ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల
- శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధపెట్టామని, టీడీపీ హయాంలోనే నేరాలు కట్టడి చేశామని ఆయన వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్కు గత ప్రభుత్వం పంపించిందని.. ఐదేళ్లూ వీఆర్లో ఉన్న పోలీసు అధికారులూ ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తన మీద చిన్నప్పటి నుంచి ఒక్క కేసు కూడా లేదని.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్ మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారని.. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారని.. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Minister Atchannaidu: ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తాం..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారని.. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారని.. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుత హోం మంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గు చేటన్నారు. పైల్స్ ఆపరేషన్ చేయించకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలో మీటర్లు తిప్పారని మండిపడ్డారు. రఘురామకృష్ణం రాజును జైల్లో పెట్టి కొడుతుంటే.. ఆనాటి సీఎం ఫోన్లో చూసి ఆనందించారని ఆగ్రహించారు. రఘు రామకృష్ణం రాజును తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వచ్చినా రఘురామ వెళ్లలేకపోయారని వాపోయారు. తాను అమరావతి పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారన్న సీఎం చంద్రబాబు.. అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని నాటి డీజీపీ కామెంట్ చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
-
Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!