CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పుల (Heat Waves) నేపథ్యంలో చంద్రబాబు గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రజలను ఈ ప్రచండ భానుడి సెగల నుంచి కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో లోకల్ హాలిడేస్ (స్థానిక సెలవులు) ప్రకటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫీసులకు స్థానికంగా సెలవులు ఇవ్వాలా? లేక టైమింగ్స్ మార్చాలా? ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనే దానిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ రివ్యూ మీటింగ్లో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రతి ఊరిలో, పట్టణాల్లోని మెయిన్ సెంటర్లలో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ, అలాగే వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
ఎండల తీవ్రతపై ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అవేర్నెస్ కల్పించడానికి జిల్లా కలెక్టర్లందరూ ప్రెస్ మీట్స్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు డైరెక్ట్ చేశారు. వాతావరణ హెచ్చరికలను బట్టి ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పారు. అమరావతిలో జరిగిన ఈ ఇంపార్టెంట్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల టాప్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ప్రజలు కూడా మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
