CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ఏపీలో హీట్వేవ్పై సీఎం చంద్రబాబు సమీక్ష
- వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం
- టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలన్న సీఎం చంద్రబాబు
- తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పుల (Heat Waves) నేపథ్యంలో చంద్రబాబు గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రజలను ఈ ప్రచండ భానుడి సెగల నుంచి కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో లోకల్ హాలిడేస్ (స్థానిక సెలవులు) ప్రకటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫీసులకు స్థానికంగా సెలవులు ఇవ్వాలా? లేక టైమింగ్స్ మార్చాలా? ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనే దానిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ రివ్యూ మీటింగ్లో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రతి ఊరిలో, పట్టణాల్లోని మెయిన్ సెంటర్లలో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ, అలాగే వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ఎండల తీవ్రతపై ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అవేర్నెస్ కల్పించడానికి జిల్లా కలెక్టర్లందరూ ప్రెస్ మీట్స్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు డైరెక్ట్ చేశారు. వాతావరణ హెచ్చరికలను బట్టి ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పారు. అమరావతిలో జరిగిన ఈ ఇంపార్టెంట్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల టాప్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ప్రజలు కూడా మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!