CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ఏపీలో హీట్వేవ్పై సీఎం చంద్రబాబు సమీక్ష
- వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం
- టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలన్న సీఎం చంద్రబాబు
- తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పుల (Heat Waves) నేపథ్యంలో చంద్రబాబు గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రజలను ఈ ప్రచండ భానుడి సెగల నుంచి కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో లోకల్ హాలిడేస్ (స్థానిక సెలవులు) ప్రకటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫీసులకు స్థానికంగా సెలవులు ఇవ్వాలా? లేక టైమింగ్స్ మార్చాలా? ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనే దానిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ రివ్యూ మీటింగ్లో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రతి ఊరిలో, పట్టణాల్లోని మెయిన్ సెంటర్లలో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ, అలాగే వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఎండల తీవ్రతపై ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అవేర్నెస్ కల్పించడానికి జిల్లా కలెక్టర్లందరూ ప్రెస్ మీట్స్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు డైరెక్ట్ చేశారు. వాతావరణ హెచ్చరికలను బట్టి ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పారు. అమరావతిలో జరిగిన ఈ ఇంపార్టెంట్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల టాప్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ప్రజలు కూడా మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!