CM Chandrababu: నేడు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
- నేడు మంత్రులు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం..
- జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర- 2047 విజన్, పది సూత్రాలపై చర్చ..
- ఆదాయ ఆర్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, PPP ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష..
- సమావేశానికి వర్చువల్గా హాజరు కానున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాలపై చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వర్చువల్ గా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
అలాగే, రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా సమీక్షించనున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!