NTV Telugu Site icon

CM Chandrababu: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

Babu

Babu

CM Chandrababu: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా పోస్ట్ చేశారు. భగవత్ గీతలో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని నిత్యం మనం స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే అని ఏపీ సీఎం పేర్కొన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే.. ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని అన్నారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘశ్యాముని కృపా, కటాక్షం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.