Chandrababu: డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
- డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం..
- డీఎస్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు..
- డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని చెప్పుకొచ్చారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ఏపీ సీఎం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.
Read Also: Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించిన డీఎస్ 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పని చేశారు. ఇక, 2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరిన డి. శ్రీనివాస్.. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరారు. డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు.. నిజామాబాద్ మేయర్గా పని చేసిన డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్.. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్న రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ ఉన్నారు. అయితే, హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహం ఉంచడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఇక, రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!