YS Jagan: సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడిన వైసీపీ అధినేత జగన్..
- సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ ట్వీట్టర్) వేదికగా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇచ్చిన కూడా.. ఆ తీర్పును వక్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందని అసత్య ప్రచారం చేస్తు్నారని ఆయన సీరియస్ అయ్యారు.
Read Also: Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
ఇక, శుక్రవారం ‘ట్విట్టర్’లో టీడీపీ పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్ లో తిరుపతి లడ్డూలో జంవుతుల కొవ్వు కలిసిందని చెప్పారని మాజీ సీఎం జగన్ తెలిపారు. తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇక, మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భయం, భక్తి ఉండాలని అన్నారు. ఇంత దారుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరణ చేయడం దారుణమని చెప్పుకొచ్చారు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbnపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆరోపించారు.
గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbn పై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉంది. pic.twitter.com/RozJAB94aD
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024
తాజావార్తలు
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!