YS Jagan: సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడిన వైసీపీ అధినేత జగన్..
- సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ ట్వీట్టర్) వేదికగా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇచ్చిన కూడా.. ఆ తీర్పును వక్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందని అసత్య ప్రచారం చేస్తు్నారని ఆయన సీరియస్ అయ్యారు.
Read Also: Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
ఇక, శుక్రవారం ‘ట్విట్టర్’లో టీడీపీ పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్ లో తిరుపతి లడ్డూలో జంవుతుల కొవ్వు కలిసిందని చెప్పారని మాజీ సీఎం జగన్ తెలిపారు. తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇక, మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భయం, భక్తి ఉండాలని అన్నారు. ఇంత దారుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరణ చేయడం దారుణమని చెప్పుకొచ్చారు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbnపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆరోపించారు.
గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbn పై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉంది. pic.twitter.com/RozJAB94aD
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!