Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
- ఎస్సీఓ సమ్మిట్ కోసం పాకిస్తాన్ వెళ్లనున్న జైశంకర్..
- ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనాలని పీటీఐ నేత ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్లోని డీ-చౌక్లో నిరసనలకు ప్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేత నుంచి జైశంకర్కి వింత ఆహ్వానం ఒకటి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా చేపట్టిన నిరసనల్లో జైశంకర్ పాల్గొనాలని పీటీఐ నాయకుడు ఒకరు ఆహ్వానం పంపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సలహాదారు ముహమ్మద్ అలీ సైఫ్ శుక్రవారం జియో న్యూస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిరసనలో పాల్గొనవలసిందిగా జైశంకర్ని కోరారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Matka Teaser : మనకు ఏది అవసరమో అదే ధర్మం.. ఆసక్తి రేపుతున్న ‘మట్కా’ టీజర్
మా నిరసనల్లో పాల్గొనడానికి, మా ప్రజలతో మాట్లాడటానికి, పాకిస్తాన్లో ప్రతీ ఒక్కరూ కూడా నిరసన తెలిపే హక్కు ఉన్న బలమైన ప్రజాస్వామ్యాన్ని చూడటానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ని ఆహ్వానించాము అని సైఫ్ అన్నారు. తమ పార్టీ నిరసనని చూసి విదేశీ ప్రజలు సంతోషిస్తారని చెప్పారు. ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఒత్తిడి తేవాలని పీటీఐ నిరసన తెలుపుతోంది. ఏడాదికి పైగా జైలులో ఉన్న తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే శనివారం డి-చౌక్ వద్ద నిరసన తెలిపేందుకు పిలుపునివ్వడంతో, పాక్ భద్రతాబలగాలు, పాక్ ఆర్మీ ఇస్లామాబాద్లో మోహరించాయి. రాబోయే ఎస్సీఓ సమ్మిట్ కోసం సైన్యం అక్టోబర్ 5-17 వరకు నగరంలో పాగా వేసింది. వేరే ప్రాంతాల నుంచి నగరానికి రాకుండా ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలను మూసేసింది. మొబైల్ సేవలపై ఆంక్షలు విధించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!