Amaravathi: అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ విముఖత చూపారు. ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ వేరే బెంచ్కు బదిలీ అయ్యింది.
Read Also: Gudivada Amarnath: జనసేన క్యాడర్ చంద్రబాబుకి బానిసలా?
Also Read
కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సీజేఐ విముఖత చూపడంపై టీడీపీ సీనియర్ నేత తెనాలి శ్రావణ్ కుమార్ స్పందించారు. రాజధానిగా అమరావతే ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వమ్ము చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిపై వచ్చిన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యు.యు లలిత్ విముఖత చూపడం హర్షణీయమన్నారు. తాను సభ్యుడిగా లేని మరో బెంచికి బదిలీ చేయాలని ఆదేశించడం ఆనందదాయకం అని శ్రావణ్ కుమార్ తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. న్యాయస్థానాల తీర్పులకు ప్రభుత్వం విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును శషబిషలు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రాంతీయ, కుల చిచ్చులను ఏపీ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరని.. రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీ సాక్షిగా తాను అమరావతిని రాజధానిగా బలపరిచిన విషయానికి కట్టుబడి ఉండాలని కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఎప్పటికైనా గెలిచేది న్యాయం, ధర్మమే అని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!