MLA Adimulam: పెద్దిరెడ్డిని ఎదిరించి బయటకు వచ్చా.. ఇప్పుడు ఇంకో రెడ్డిని తెచ్చి నా మీద పెడుతారా..? చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటా..
- నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ ఎక్కువైంది.. నియంత్రం ధోరణి వద్దు అనుకునే పెద్దిరెడ్డి ఎదిరించి బయటకు వచ్చా..
- ఇప్పుడు ఇంకో రెడ్డిని తెచ్చి నా మీదా పెడుతారా...? సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adimulam: తన నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ ఎక్కువైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. సత్యవేడు నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవహారం పెరిగిపోయిందని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా తనకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ప్రవర్తనపై మండిపడ్డ ఆయన, త్వరలోనే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
Read Also: Siddaramaiah: అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించాం.. బ్రేక్ఫాస్ట్ తర్వాత సిద్ధరామయ్య క్లారిటీ
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
నియంత్రణ ధోరణి నాకిష్టం లేదు.. అందుకే పెద్దిరెడ్డిని ఎదిరించాను.. ఇప్పుడు మరొక రెడ్డిని తెచ్చి నామీద పెట్టాలా? అంటూ అదిమూలం అసహనం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. చిన్నచిన్న విషయాలు సీఎం చంద్రబాబుకు కూడా తెలియడం లేదు..? ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎం వద్ద వివరంగా చెబుతాను అన్నారు. ప్రోటోకాల్ను పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని ఆదిమూలం అన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఎలా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు.. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు?” అని ప్రశ్నించారు.
Read Also: Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
అసలు, ప్రజా దర్బార్ నేను పెడితే.. నువ్వు ఎలా పెడుతావు? అని మండిపడ్డారు ఆదిమూలం.. తన స్థానంలో పార్టీ కోఆర్డినేటర్ వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ పెట్టేది నేను. ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు.. సురుటుపల్లి ఆలయంలోనూ నాకు గౌరవం ఇవ్వలేదు.. సురుటుపల్లి చైర్మన్గా ఒక బియ్యం దొంగని నియమించారు అని ఆరోపించారు. ఈ నియామకంపై కూడా త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చెరువు కోట్టిన ప్రాంతాల్లో ప్రజలకు ఆశించినంత సహాయం అందలేదని, ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!