Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలనాటి సినీ రత్నం, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రముఖుల మరణాలను సరదాగా మీమ్స్గా మార్చే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన తల్లి శ్రీదేవి మరణం గురించి ప్రతి సారి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పింది. తల్లి మరణాన్ని వాడుకుని తను వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తోంది అని ప్రజలు అనుకోకూడదు అనే భయంతో చాలాసార్లు ఆ విషయాన్ని మాట్లాడటానికి కూడా వెనుకంజ వేశానన్ని తెలిపింది జాన్వీ. “ఆ సమయంలో నేను ఎదుర్కొన్న వేదన, అనుభవించిన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను.. చెప్పిన అర్థం కాదు. అది పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతి” అని ఆమె చెప్పింది.
Also Read : Naga Vamsi : ఐ బొమ్మ రవి విషయంలో నాగవంశీ సైలెంట్.. భయపడుతున్నాడంటూ నెటిజన్ల కామెంట్స్ !
Also Read
అలాగే ప్రస్తుత జర్నలిజం, మీడియా సంస్కృతి, సోషల్ మీడియా పబ్లిక్ ఫోకస్ మానవ నైతికతను పూర్తిగా దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాన్ని జాన్వీ వ్యక్తం చేసింది. ప్రముఖులు చనిపోయిన వెంటనే వారి మరణాన్ని మీమ్స్గా మార్చే ధోరణి చాలా భయంకరమని ఆమె చెప్పింది..‘‘ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా చాలా మంది చాలా రకాల వార్తలు పుట్టించారు. ఒకరి మరణాన్ని మీమ్గా మార్చడం ఎంతో పాపం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. రోజు రోజుకు ఈ పరిస్థితి మరింత దిగజారిపోతోంది” అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం తర్వాత కొద్ది నెలలకే జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తల్లి మరణం తర్వాత మీడియా చూపులు, సోషల్ మీడియా దాడులు, బాధను మీమ్లుగా మార్చే సంస్కృతి తమ కుటుంబానికి చాలా కఠినంగా అనిపించిందని ఆమె మరోసారి గుర్తుచేసుకుంది
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..