Minister Ram Prasad Reddy: శాంతియుతంగా పరిపాలన కొనసాగించడమే మా ప్రభుత్వ లక్ష్యం
- గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు ఇవ్వడం హాస్యాస్పదం..
- శాంతియుతంగా పరిపాలన సాగించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ram Prasad Reddy: చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పుంగనూరు ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రావడం ఆస్యాస్పదం అని మండిపడ్డారు. పుంగనూరు రైతులు ప్రజలపై రాళ్ల దాడి చేయించిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అయినా అధికార మదం వాళ్లకు తగ్గలేదు అని విమర్శించారు. పుంగునూరులో సమస్యలు చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వారిపై దాడులు చేయించడానికి ఎంపీ ప్రయత్నించాడు.. మాజీ సీఎం లాగా ప్రస్తుత మా అధినాయకత్వం దాడులు చేయమని చెప్పడం లేదు అని మంత్రి ఎద్దేవా చేశారు. శాంతియుతంగా పరిపాలన సాగించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం.. పుంగనూరు అభివృద్ధిపై మేము చర్చించకుండా ఎంపీ గురువారం ఉదయం ఎవరికి తెలియకుండా పుంగునూరు చేరుకొని అక్కడ గలాటాలు చేయించి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..
Also Read
ఇక, గత ప్రభుత్వ హయాంలో పాడి రైతులు మామిడి రైతులు రక్తం తాగిన వీళ్లు ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గనులు, క్వారీలు మద్యంపై గుప్తాధిపత్యం సాధించి దోచుకున్నవన్నీ కాపాడుకోవడమే వారి లక్ష్యం.. ప్రజలు మనసు మళ్లించడానికి రౌడీలను తీసుకొని దాడులు చేయించి.. వారు పబ్బం కడుపుకోవడం మంచిది కాదు అని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తూ మేము ఊరుకోం అని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..
అయితే, గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై, నాయకులపైన దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టలేదా అని చల్లబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి ఎవరైనా గదులు అద్దెకిస్తే వారిని బెదిరించి కార్యాలయాలు ఖాళీ చేయించలేదా.. ఇలాంటివన్నీ మీరు చేసి ప్రస్తుతం ఇప్పుడు మాపై బురద చల్లడం మంచి పద్ధతి కాదు అన్నారు. మా అధిష్టానం మాకు శాంతియుత మార్గంలో పరిపాలన సాగించాలని చెబుతుంది.. అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి అండదండలు అందిస్తామన్నారు. ఈ రోజు జరిగిన దాడిలో ఇరు వర్గాల కార్యకర్తలు ఇబ్బందులు పడిన విషయం మీరు గుర్తించలేదా అని చల్లబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!