Oldage Pension: నగర పంచాయతీ ఛైర్మన్ కు వృద్ధాప్య పింఛన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే..అర్హత లేకున్నా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఛైర్మన్ గా ఉంటూ నలుగురు అర్హులకు పెన్షన్ల కోసం సిఫారసులు చేయాల్సింది పోయి ఆయనే పెన్షన్ తీసుకోవటమేంటని విమర్శలు వస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు, నెలా నెలా వృద్ధాప్య పింఛను అందుకుంటున్న విషయం జిల్లాలో హాట్ టాపిక్ లా మారింది.. డెబ్బై ఏళ్లకు పైగా వయసున్న చల్లా అంకులు.. వైసీపీ తరఫున చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. ప్రతి నెలా చైర్మన్ హోదాలో అధికారికంగా 12 వేల రూపాయల గౌరవ వేతనాన్ని పొందుతున్నారు. గతంలో చల్లా అంకులు 108709778 అనే గుర్తింపు నంబరుతో వృద్ధాప్య పెన్షన్ పొందేవారు. అయితే నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత, వస్తున్న గౌరవ వేతనంతో పాటు ప్రతీనెలా క్రమం తప్పకుండా వృద్ధాప్య పెన్షన్ 2వేల 500ను కూడా తీసుకుంటున్నారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు చెలరేగుతున్నాయి. చీమకుర్తి నగరపంచాయతీ అధికారులు, నిబంధనలకు విరుద్దంగా వృద్దాప్య పెన్షన్ ను సైతం ఠంచన్గా ప్రతి నెలా ఎలా అందిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు మాత్రం.. తనకు ఈ అంశంపై అవగాహన లేకపోవటం వల్లే ఇదంతా జరిగిందంటున్నారు. గౌరవ వేతనం తీసుకుంటూ వృద్ధాప్య పెన్షన్ తీసుకోకూడదని తనకు తెలియదన్నారు. ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా తాను వ్యవహరించనని తన గౌరవ వేతనాన్ని రద్దు చేసుకుంటానన్నారు. ఇక నుండి వృద్ధాప్య పెన్షన్ 2,500 రూపాయలు మాత్రమే తీసుకుంటానన్నారు. ఇదిలా వుంటే.. పంచాయతీ ఛైర్మన్ పెన్షన్ వ్యవహారం తన దృష్టికి వచ్చిందని.. ఉన్నతాధికారులను సంప్రదించి తగిన చర్యలు చేపడతామంటున్నారు నగర పంచాయతీ కమీషనర్ వెంకటరామిరెడ్డి.
సామాన్యులకు అందని ద్రాక్షలా ఉన్న పెన్షన్లు.. కాస్తా పలుకుబడి ఉంటే చాలు ఆస్తులతో సంబంధం లేకుండా అధికారులు ఇచ్చేస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విషయం రచ్చరచ్చగా మారేంత వరకూ అధికారులు మేల్కొకుండా ఉండటం ఏంటని నిలదీస్తున్నారు…
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!