తిరుమల ఏఎస్పీ మునిరామయ్యపై చీటింగ్ కేసు నమోదైంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ క్రింద మునిరామయ్యకు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.హైదరాబాదుకు చెందిన చుండూరు సునీల్ కుమార్ అనే వ్యాపారి నుండి రూ 1.2 కోట్లు కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
2019 లో జరిగిన ఈ ఘటన జరిగిందని, తాను మోసపోయానని తెలిసి కేసు పెట్టానన్నారు వ్యాపారి సునీల్ కుమార్. ఏఎస్పీ మునిరామయ్య, జయప్రతాప్, కేవీ రాజుపై కేసు పెట్టారు వ్యాపారి సునీల్ కుమార్. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ వెంకట్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించి ఏపీ పోలీసులకు సమగ్ర నివేదిక సమర్పించారు హైదరాబాద్ పోలీసులు.