Amaravathi: అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఏడేళ్లు.. ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమైందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read Also: Psycho Injured Old Man: పలాసలో సైకో వీరంగం.. వృద్ధుడి తల పగులగొట్టి
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని మండిపడ్డారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని.. ఆంధ్రుల రాజధాని అమరావతే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని… 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని జోస్యం చెప్పారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని.. అమరావతే గెలుస్తుందని.. ఇదే ఫైనల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది.
ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని @narendramodi చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది.(1/3) pic.twitter.com/hKIPgOcXaW
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2022
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..