Chandrababu Naidu: దళితులకు ఏపీలో రక్షణ లేదని తేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. నెల్లూరులో మరో దళితుడికి జగన్ ఉరి వేశారు.కావలిలో కరుణాకర్ ఆత్మహత్యకు వైసీపీ నేతల వేధింపులే కారణం.ఒక ఘటన మరువక ముందే మరో దారుణం ఎపిలో సర్వసాధారణం అయిపోయింది.రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు?నెల్లూరు జిల్లా, కావలి మండలం, ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు.
తాను లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనివ్వకుండా, వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డిలు వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖలో తెలిపారు.శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా కూడా ఉన్న జగదీష్ రెడ్డి ఆగడాలకు జగన్ రెడ్డి ముందుగానే అడ్డుకట్ట వేసివుంటే , ఇప్పుడు ఈ దళిత సోదరుని ప్రాణాలు పోయేవి కావు.భూదందాలు, సెటిల్మెంట్లను దాటిన ధనదాహం.. ఇప్పుడు వ్యక్తుల ప్రాణాలను కూడా మింగేస్తోందని ట్వీట్ చేశారు చంద్రబాబు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డీ…ఇదిగో, నీ పాలనలో మరో దళితుడికి నువ్వేసిన ఇంకో ఉరి. ఒక ఘటన మరువక ముందే మరో దారుణం ఎపిలో సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది?..రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు?.. అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరగాలి(1/5)#DalitLivesDontMatterInAp pic.twitter.com/kSgc9J32eu
— N Chandrababu Naidu (@ncbn) August 20, 2022
సమాజ శత్రువులుగా మారిన వైసీపీ రాక్షసులను కట్టడి చేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది.నేడు ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి, ఒక కుటుంబం రోడ్డున పడడానికి కారణమైన వారిపై కనీసం ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికార్లు మానవత్వం మరిచి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే అంతకంటే నీచం మరొకటి ఉండదు. కొందరు పోలీసులు తమ మనసుల మురికిని ఖాకీ దుస్తులకూ అంటిస్తున్నారు. జరిగినదానికి జగన్ రెడ్డి బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read Also: Madhya Pradesh: తల గాయానికి “కండోమ్ ప్యాక్” తో డ్రెస్సింగ్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!