CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
- ప్రజా వేదికలో సీఎం కీలక ప్రసంగం
- విజయనగరంలో పార్టీ నేతలతో భేటీ
- విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు అనకాపల్లి, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు , అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం నుంచి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రతిష్ఠను చాటడం వరకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అనకాపల్లి జిల్లాలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ , ప్రజా వేదిక
ముఖ్యమంత్రి పర్యటన వివరాల ప్రకారం, ఆయన శనివారం ఉదయం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అనంతరం ఏ.కొడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 1:15 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు.
Also Read
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
విజయనగరం పర్యటన.. ఆపై విశాఖలో ‘బ్రిక్స్’ అంతర్జాతీయ సదస్సు..
అనకాపల్లి జిల్లా పర్యటనను ముగించుకుని, ముఖ్యమంత్రి విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్తారు. సాయంత్రం 4:20 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే కె.లలితకుమారి నివాసానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభమయ్యే ‘రెండో బ్రిక్స్ (BRICS) యువజన, క్రీడల మంత్రుల సమావేశం–2026’కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.
విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సు కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఒకే రోజులో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు , అంతర్జాతీయ దౌత్య పరిణామాలను సమన్వయం చేస్తూ సీఎం సాగిస్తున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?