Chandrababu Meeting: 12 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో బాబు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు నేడు సమావేశంకానున్నారు.
ఈ సమావేశానికి గంటా, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులు సమావేశానికి రావాలని అధిష్టానం కోరింది. సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వస్తారో రారోననే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును విడిగా కలుస్తానని పార్టీకి గంటా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీకి దూరంగా వుంటున్నారు గంటా. గత ఏడాది వైసీపీలో చేరతారనే సంకేతాలు వినిపించాయి. కానీ ఎందుకో మరి గంటా మౌనంగా వున్నారు. పార్టీల మార్పు గురించి ఎన్ని ఊహాగానాలు వచ్చినా గంటా మాత్రం మౌనంగా వుండి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాల లేఖను ఏకంగా స్పీకర్కు పంపించారు. మళ్లీ కొద్దిరోజులుగా గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇప్పటికే భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గానికి ఎవరిని ఇంచార్జిగా నియమించాలనే దానిపై సుదీర్ఘంగా నేతల అభిప్రాయం తీసుకున్న చంద్రబాబు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. మూడు నాలుగు రోజుల్లో బలమైన నేతను ఇంచార్జి గా నియమిస్తామని నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంచార్జి పదవి ఆశిస్తున్న వారిలో ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్, కంచర్ల శ్రీకాంత్ వున్నారు. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో కొత్త వారి కోసం చూస్తున్న టీడీపీ అధిష్టానం సరైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. అదే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇవాళ రెండోరోజు సర్పంచ్ లకు అవగాహన సదస్సు జరుగుతుంది. కొత్త సర్పంచ్ లకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ప్రకాశం, నెల్లూరు, తూ.గో జిల్లాల నుంచి గెలుపొందిన సర్పంచ్ లు ఈ సమావేశానికి హాజరవుతారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?