CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
- కృష్ణానదిలో పడవ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ నుంచి పల్నాడు కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన
- ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని పల్నాడు కలెక్టర్కు సీఎం చంద్రబాబు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పడవ నదిలోని ఇసుక దిబ్బను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని, ఇందులో నలుగురు మృతి చెందగా మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబాలకు తక్షణమే అందజేయాలని పల్నాడు కలెక్టర్ను ఆదేశించారు. నది నుంచి వెలికితీసిన మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘోరాలు పునరావృతం కాకుండా నదీ తీరాల్లో కఠినమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై తదుపరి సహాయక చర్యలు, సమన్వయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక అధికారి ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్ , జిల్లా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
తాజావార్తలు
-
Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
-
Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
-
First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
-
PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
-
Satya Dev: ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు’ అని బిల్డప్ ఇచ్చేవారు..డిసపాయింట్మెంట్ నాకు కొత్త కాదు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..