CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
- కృష్ణానదిలో పడవ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ నుంచి పల్నాడు కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన
- ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని పల్నాడు కలెక్టర్కు సీఎం చంద్రబాబు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పడవ నదిలోని ఇసుక దిబ్బను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని, ఇందులో నలుగురు మృతి చెందగా మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబాలకు తక్షణమే అందజేయాలని పల్నాడు కలెక్టర్ను ఆదేశించారు. నది నుంచి వెలికితీసిన మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘోరాలు పునరావృతం కాకుండా నదీ తీరాల్లో కఠినమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై తదుపరి సహాయక చర్యలు, సమన్వయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక అధికారి ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్ , జిల్లా కలెక్టర్కు బాధ్యతలను అప్పగించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy : మళ్లీ మంచి రోజులు వస్తాయి.. కూటమి పాలనపై సజ్జల ఫైర్..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
తాజావార్తలు
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!