Chandrababu: ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..
- సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన గిరిజనులు..
- గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ పరిశీలించిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎంకు సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి, అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరాం తాతయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: Bangladesh: మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపే 16 మంది వీరే..విద్యార్థి నాయకులకు చోటు
Also Read
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ఇక, గిరిజన తెనేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా ఉంటుందని గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతియైన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.?
కాగా, గిరిజనుల సాగు చేసే తృణధాన్యాల వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు.. ఎంత మేర ఆదాయం వస్తుందని గిరిజనులను అడిగారు.. నన్నారి షర్బత్ వంటివి శ్రీశైలం ప్రాంతంలోని చెంచులే చేస్తారని గుర్తు చేసుకున్నారు. గిరిజనులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రకాల గిరిజన ఉత్పత్తులకు ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మంచి డిమాండ్ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!